¤ గత ఆర్థిక సంవత్సరంలో (2010-11) ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2009-10తో పోలిస్తే 37.55 శాతం వృద్ధితో 24,586 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.11,06,370 కోట్లు) చేరాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లు కోలుకోవడంతో పాటు కొత్తగా ప్రవేశించిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు కూడా ఎగుమతులు పెరగడానికి దోహదం చేశాయి. ¤ గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దీంతో ఎగుమతులను ప్రస్తుత సంవత్సరం (2011-12)లో 30,000 కోట్లడాలర్ల (దాదాపు రూ.13,50,000 కోట్లు)కు పెంచగలమన్న విశ్వాసం ఎగుమతిదార్లలో కలిగింది.
¤ మరోవైపు 2013-14 ఏడాది నాటికి ఎగుమతులు 45,000 కోట్ల డాలర్లకు పెంచే లక్ష్యంతో ఒక వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధంచేసింది. ¤ 2010-11 ఏడాదికి దిగుమతులు 35,000 కోట్ల డాలర్లు దాటినప్పటికీ అంతక్రితం ఏడాదితో పోలిస్తే పెరుగుదల 21.6 శాతానికేపరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 35,069 కోట్ల డాలర్ల దిగుమతులు జరిగాయి. దీంతో వాణిజ్య లోటు 10,483 కోట్ల డాలర్లకుపరిమితమైంది. వాణిజ్య లోటు 12,000 - 13,000 కోట్ల డాలర్లు ఉండగలదని గతంలో అంచనా వేశారు. ¤ భారత విదేశీ వాణిజ్యం దాదాపు 60,000 కోట్ల డాలర్లకు చేరింది. ఇది భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో సగానికి సమానం.
¤ 2011-12 సంవత్సరానికి రిజర్వుబ్యాంకు పరపతి విధాన సమీక్షను ముంబయిలో ప్రకటించింది. ముఖ్యాంశాలు:
¤ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రెపో, రివర్స్ రెపో రేట్లను అనూహ్యరీతిలో అరశాతం చొప్పున పెంచింది. దీంతో రెపో రేటు7.25 శాతానికి, రివర్స్ రెపో రేటు 6.25 శాతానికి పెరిగాయి. ¤ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), బ్యాంకు రేట్లను యాథాతథంగా ఉంచింది. ఇవి 6 శాతంగా ఉన్నాయి. ¤ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటును 3.5 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. 3.5 శాతం వడ్డీ రేటును ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించారు.తాజా పెంపు వల్ల చిన్న పొదుపుదార్లకు ప్రయోజనం చేకూరుతుంది. ¤ 2011-12 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు (జీడీపీ) అంచనా 8 శాతానికి తగ్గింపు. ¤ 2011-12 చివరకు ద్రవ్యోల్బణ రేటును 6 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ¤ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) అనే కొత్త విధానానికి ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. దీని కింద బ్యాంకులు తమవద్ద ఉన్న డిపాజిట్లలో1 శాతం వరకూ స్వల్ప కాలిక నిధుల రూపంలో ఆర్బీఐ నుంచి 8.25 శాతం వడ్డీకి రుణంగా పొందడానికి అనుమతిస్తారు. మే 7 నుంచి ఇదిఅమల్లోకి వస్తుంది. ¤ బ్యాంకులు, రుణ ప్రేరిత మ్యూచువల్ ఫండ్ల మధ్య నిధుల చలామణీ నివారించేందుకు లిక్విడ్ పథకాల్లో బ్యాంకులు పెట్టే పెట్టుబడులనువాటి నికర విలువలో 10 శాతానికి పరిమితం చేసింది. ¤ సూక్ష్మ ఆర్థిక సంస్థలు విధించే వడ్డీ రేటుపై ఆర్బీఐ పరిమితి విధించింది. రుణ గ్రహీతల నుంచి 26 శాతానికి మించి వసూలు చేయరాదనిస్పష్టం చేసింది. సూక్ష్మరుణ సంస్థ ఒక వ్యక్తికి గరిష్ఠంగా రూ.35,000 మించి రుణం ఇవ్వడానికి వీల్లేదు. గరిష్ఠ రుణ పరిమితి రూ.25,000,వడ్డీరేటు గరిష్ఠంగా 24 శాతానికి మించరాదని మాలేగామ్ కమిటీ సిఫార్సు చేసింది. రిజర్వు బ్యాంకు ఈ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని పైవాటిని నిర్ణయించింది. ¤ వాణిజ్య బ్యాంకులు కొత్తగా ఏర్పాటు చేసే శాఖల్లో కనీసం 25 శాతం బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో (టైర్ 5, టైర్ 6కేంద్రాలు) ఉండాలని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ¤ 2000 పైగా జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యం నెరవేరాల్సిన అవసరం ఉందని పరపతి విధానంలో రిజర్వుబ్యాంకు పేర్కొంది. గత రెండేళ్లలో వాణిజ్య బ్యాంకులు ప్రారంభించిన కొత్త శాఖల్లో దాదాపు 20 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ¤ 2012 మార్చి నాటికి బ్యాంకింగ్ సేవలందించడానికి 72,800 గ్రామాలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక ఖరారైంది. కేంద్ర ప్రణాళికా సంఘం రూ.43 వేల కోట్ల వార్షిక ప్రణాళికకు ఆమోద ముద్రవేసింది. క్రితంసారి రూ. 36,800 కోట్లున్న ప్రణాళిక స్వరూపం ఈసారి 14.4 శాతం పెరిగింది.
¤ న్యూఢిల్లీలోని యోజనా భవన్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్సింగ్ అహ్లువాలియా, ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్ రెడ్డిమధ్య జరిగిన చర్చల అనంతరం రూ.43 వేల కోట్ల వార్షిక ప్రణాళికకు అనుమతి లభించింది. ¤ ప్రభుత్వం రూ.42,915.37 కోట్లకు అనుమతి కోరగా ప్రణాళికా సంఘం దాన్ని మరో రూ.84.63 కోట్లు పెంచి రూ.43 వేల కోట్లకు ఆమోదంతెలిపింది. ¤ రాష్ట్రం డిమాండ్లు: ¤ ప్రాణహిత- చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయహోదా ¤ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను ప్రత్యేక మౌలిక వసతుల కారిడార్కింద చేర్చి రూ.2400 కోట్లు ఇవ్వాలి. ¤ వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూ.6 వేలకోట్లు కావాలి. ¤ 2539 కిలోమీటర్ల 5 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలి. ¤ గ్రామీణ రహదారి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూ.3,967 కోట్లు కావాలి. ¤ చిత్తూరు, నల్గొండ, ప్రకాశం, విజయనగరం, వరంగల్ జిల్లాల్లో తాగునీటి సమస్య నివారణకు గ్రామీణ నీటి పథకం కింద రూ.3 వేల కోట్లుఇవ్వాలి. ¤ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.307 కోట్లు మంజూరు చేయాలి. ¤ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద 108 సర్వీసులకు రూ.54.5 కోట్లు, 104 సర్వీసులకు రూ.50.4 కోట్లు మంజూరు చేయాలి. ¤ దేశంలో సగటున 48.5 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 82 శాతం మంది రైతులు రుణాలఊబిలో చిక్కినట్లు పవర్ పాయింట్ ప్రెజెంట్షన్లో ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో 26 లక్షల మంది (21 శాతం) రైతులకు రుణాలుఅందుతున్నాయని పేర్కొంది. ప్రణాళిక స్వరూపం ¤ సొంత వనరులు : రూ.19,223.47 కోట్లు ¤ తేనున్న అప్పులు : రూ.17,952 కోట్లు ¤ కేంద్ర సాయం : రూ.5,739.48 కోట్లు రంగాలవారీగా కేటాయింపులు ¤ ఆర్థిక సేవలు : రూ.26,710.21 కోట్లు (62.24 శాతం) ¤ సామాజిక సేవలు : రూ.15,947.57 కోట్లు (37.16 శాతం) ¤ సాధారణ సేవలు : రూ.257.59 కోట్లు (0.60 శాతం) కేటాయింపులు (రూ. కోట్లలో) ¤ వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు : రూ.2097 ¤ సాగునీటి రంగం : రూ.14970 ¤ గ్రామీణాభివృద్ధి : రూ.4224 ¤ ఇంధనం : రూ.656 ¤ పరిశ్రమలు, ఖనిజం : రూ.632 ¤ రవాణా : రూ.2929 ¤ విద్య : రూ.3513 ¤ వైద్యం : రూ.1713 ¤ గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యం: రూ.598 ¤ మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి: రూ.5235 ¤ సాంఘిక సంక్షేమం: రూ.3182 ¤ సాగునీటి రంగానికి కేటాయించిన మొత్తంలో రూ.2000 కోట్లు ఏఐబీపీ (యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్) ప్రాజెక్టులకుఉద్దేశించారు. ¤ సర్వేలు నివేదికలు ¤ రాష్ట్ర విద్యాశాఖ 2010-11 విద్యా సంవత్సరం నాటికి డ్రాపౌట్స్ నివేదికను తయారుచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సేకరించినసమాచారంతో ఈ నివేదికను తయారు చేశారు. ¤ ముఖ్యంశాలు ¤ 2001 - 02లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు పదో తరగతికి (2010-11) వచ్చేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 46.21 శాతం మంది పాఠశాలకుదూరమయ్యారు. వీరిలో ఎస్టీ విద్యార్థులు 72.66 శాతం, ఎస్సీ విద్యార్థులు 49.68 శాతం. ¤ ఎస్టీ విద్యార్థుల్లో పాఠశాలలకు దూరమవుతున్న వారిలో బాలికలు 73.77 శాతం, బాలురు 71.61 శాతం మంది ఉన్నారు. ఎస్సీ విద్యార్థుల్లోబాలురు 49.68 శాతం, బాలికలు 49.67శాతం. ¤ 2006 - 07లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులు 2010 - 11 (5వ తరగతి) వచ్చే నాటికి 17.43 శాతం మంది పాఠశాలలకుదూరమయ్యారు. ఎస్సీ విద్యార్థులు 19.61 శాతం, ఎస్టీ విద్యార్థులు 36.85 శాతం మంది పాఠశాలలకు రాలేదు. ¤ 2004 - 05 లో ఒకటో తరగతి చేరిన విద్యార్థులు ఏడో తరగతి లోకి వచ్చేసరికి 22.34 శాతం మంది దూరమయ్యారు. వీరిలో ఎస్సీవిద్యార్థులు 23.91 శాతం, ఎస్టీ విద్యార్థులు 40.49 శాతం మంది ఉన్నారు. ¤ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో డ్రాపౌట్ రేటు అధికంగా ఉంది. ¤ రాష్ట్రంలో డ్రాపౌట్స్ విషయంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లాలు జిల్లా 2001-02లో చేరిన విద్యార్థులు 2010-11 నాటికి విద్యార్థులు డ్రాపౌట్ రేటు బాలురు బాలికలు మొత్తం బాలురు బాలికలు మొత్తం బాలురు బాలికలు మొత్తం మహబూబ్నగర్ 62756 57238 119994 25756 22274 48030 58.96 61.09 59.97 కర్నూలు 53511 52571 106082 24928 20217 45145 53.42 61.54 57.44 మెదక్ 49929 46731 96660 21449 20243 41692 57.04 56.68 56.87 ప్రకాశం 37267 36795 74062 17561 15289 32850 52.88 58.45 55.65 గుంటూరు 44966 46406 91372 22101 20779 42880 50.85 55.22 53.07
¤ ప్రజలకు మరింత మెరుగ్గా ఆన్లైన్ సేవలందించడానికి ఏర్పాటు చేసిన జాతీయ ఈ-పాలనకు ప్రపంచ బ్యాంకు రూ.670 కోట్ల రుణంమంజూరు చేసింది. ప్రజా సేవల అభివృద్ధి పాలసీ రుణానికి సంబంధించినపత్రాలపై ప్రపంచ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖ సంతకాలు చేశాయి.
¤ బీఎండబ్ల్యూ సంస్థ విజన్ ఎఫీషియంట్ డైనమిక్స్ పేరిట సరికొత్తగా కాన్సెప్ట్ బేస్డ్ కారును విడుదల చేసింది. కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ఎంటర్ప్రైజస్ శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ న్యూఢిల్లీలో దీన్ని ఆవిష్కరించారు. భారత్లో జర్మనీ రాయబారి థామస్ మటుసెక్ ఈ కార్యక్రమానికిహాజరయ్యారు. ¤ కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగం, లీటరుకు 26.5 కి.మీ సరాసరి ఇంధన వినియోగం, కి.మీ. ఒక్కింటికి 99 గ్రాముల దివీ2ఉద్గారాల రేటింగ్తో ఈ స్పోర్ట్స్ కారు పనితీరు ఉంటుంది. ¤ ఈ కారు మార్కెట్లోకి రావడానికి మరో రెండేళ్లు పడుతుందని బీఎండబ్ల్యూ సంస్థ పేర్కొంది.
¤ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా 'ఆల్టో' నిలిచింది. వోక్స్వ్యాగన్ 'గోల్డ్' (జర్మనీ), ఫియట్ యునో, వోక్స్వ్యాగన్ 'గోల్డ్' (బ్రెజిల్)ను తోసి రాజని నెంబర్వన్ స్థానాన్ని ఆల్టో దక్కించుకుంది. * 2010లో 3,00,956 ఆల్టో కార్లను మారుతీ సుజుకీ విక్రయించింది.ప్రపంచంలోనే ఎక్కువ అమ్ముడయ్యే కార్లను అధిగమించి ఒక భారతీయ కారు తొలిస్థానంలో నిలవడం ఇదే ప్రథమం.
¤ 2005-06 నుంచి ఇప్పటి వరకూ భారత్లో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా ఆల్టో నిలుస్తోంది. ¤ 2000 సెప్టెంబరు లో దీన్ని విడుదల చేశారు.
¤ వరి మద్దతు ధరను క్వింటాకు రూ.160 మేర పెంచాలన్న వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) ప్రతిపాదనపై కేంద్ర ఆహార శాఖవిముఖత వ్యక్తంచేసింది. 2011-12 పంట కాలానికి కమిషన్ చేసిన సూచనపై ఆహార మంత్రిత్వ శాఖ అయిష్టత చూపింది. గత ఏడాదిక్వింటాల్ సాధారణ రకం వరి ధర రూ.వెయ్యి ఉండేది.
¤ దేశంలోనే అత్యంత విలువైన ప్రభుత్వరంగ కంపెనీగా కోల్ ఇండియా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రూ. 2.5 లక్షల కోట్లనుతాకడం ద్వారా కోల్ ఇండియా ఈ ఫీట్ను సాధించింది.
¤ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా ఇప్పటి వరకూ నెంబర్వన్ ప్రభుత్వరంగ కంపెనీగా నిలుస్తున్న ఓఎన్జీసీని వెనక్కు నెట్టింది.
¤ బ్యాంకులకు రుణ నిబంధనలను రిజర్వు బ్యాంకు కట్టుదిట్టం చేసింది. వసూలు కాని రుణాలకు జరపాల్సిన కేటాయింపులను 10 శాతంవరకు పెంచింది.
¤ సబ్-స్టాండర్డ్గా వర్గీకరించిన అడ్వాన్సులకు ఇంత వరకు సర్దుబాటు 10 శాతం ఉండగా ఇక మీదట 15 శాతం ఉంటుంది. (12 నెలల పాటుప్రతి ఫలం ఇవ్వని రుణాన్ని సబ్-స్టాండర్డ్ అసెట్గా వర్గీకరిస్తారు). అదే సమయంలో సబ్-స్టాండర్డ్ అసెట్స్గా వర్గీకరించిన అన్సెక్యూర్డ్ఎక్స్పోజర్స్కు అదనంగా 10 శాతం సర్దుబాటును నిర్దేశించింది. ఈ కేటగిరికి ఇప్పటివరకూ ఉన్న 20 శాతం ప్రోవిజనింగ్ కాస్త ఇక 25 శాతానికిచేరుతుంది. ఎటువంటి హామీ (కొల్లేటరల్) ప్రమేయమూ లేనివాటిని అన్సెక్యూర్డ్ లోన్స్గా వ్యవహరిస్తారు. విద్యారుణాలు కూడా ఇందులోకేవస్తాయి. ¤ 24 నెలలుగా బ్యాంకులకు ఎటువంటి చెల్లింపులూ చెయ్యకుండా అనుమానాస్పద రుణాల కేటగిరీలో ఉన్న వాటి విషయంలో ప్రోవిజన్నిబంధన 25-100 శాతం మధ్య ఉంటుంది. 12 నెలల పాటు సబ్-స్టాండర్డ్ కేటగిరీలో ఉన్న ఆస్తిని అనుమానాస్పద రుణంగా వర్గీకరిస్తారు. ఒకఆస్తి ఏడాది పాటు అనుమానాస్పదంగా ఉంటే దీనికి 20 బదులు 25 శాతం సర్దుబాటు అవసరం అవుతుంది. మూడు సంవత్సరాల పాటుసందేహాస్పద రుణాలకు ప్రోవిజన్ను 30 నుంచి 40 శాతానికి పెంచారు. మూడేళ్ల కన్నా మించి ఇదే కేటగిరీలో ఉండే ఆస్తుల విషయంలో 100శాతం ప్రోవిజన్ ఉంచాలని నిర్దేశించారు.
¤ మార్చితో ముగిసిన మూడు నెలలకు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి 9.4 శాతంగాఉంది.
¤ మొత్తం ఏడాదికి (2010-11) స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 8.5శాతం పెరుగుదల నమోదైంది. గతంలో అంచనా వేసిన 8.6 శాతం కన్నాఇది స్వల్పంగా తక్కువ. ¤ గత ఆర్థిక సంవత్సరానికి భారత తలసరి ఆదాయం 17.9 శాతం పెరిగింది. 2009-10 సంవత్సరానికి తలసరి ఆదాయం రూ.46,492 ఉండగా2010-11 నాటికి రూ. 54,835కి చేరింది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా తలసరి ఆదాయాన్ని అంచనా వేసినట్లు కేంద్ర గణాంక సంస్థ(సీఎస్ఓ) వెల్లడించింది. 2004-05 ఏడాది ధరల్లో లెక్కిస్తే పెరుగుదల 6.5 శాతమే. 2004-05 ఏడాది ధరల్లో గత ఆర్థిక సంవత్సరానికి తలసరిఆదాయం రూ. 35,917 ఉంది. అంత క్రితం ఏడాది ఇది రూ. 33,731. ¤ గత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు 4.7 శాతానికి పరిమితమైంది. మార్చితో ముగిసిన ఏడాదికి ద్రవ్యలోటు రూ. 3,69,043 కోట్లగా ఉంది.జీడీపీలో ఇది 4.69 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ¤ ఎల్ఐసీ నుంచి కొత్త ఆరోగ్య బీమా పథకం 'జీవన్ ఆరోగ్య' వచ్చింది. పాలసీదారులే కాకుండా భార్య, భర్త, పిల్లలు (మైనర్లు), తల్లిదండ్రులతోపాటు అత్తమామలకు కూడా వర్తించడం ఈ పథకం ప్రత్యేకత. |
Monday, July 21, 2014
మే 2011 - ఆర్థికరంగం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment