Monday, July 21, 2014

డిసెంబరు 2011 - ఆర్థికరంగం

డిసెంబరు 1 
¤ భారత ఎగుమతులు అక్టోబరులో కేవలం 10.8 శాతం మేర పెరిగి, 19.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది గత రెండేళ్లలో అతి తక్కువ స్థాయి కావడం గమనార్హం.
¤ అక్టోబరులో దిగుమతులు 21.7 శాతం మేర వృద్ధి చెంది, 39.5 బిలియన్ డాలర్ల మేరకు నమోదయ్యాయి. ఫలితంగా విదేశీ వాణిజ్య లోటు 19.7 బిలియన్ డాలర్లుగా లెక్క తేలింది. గత నాలుగు సంవత్సరాల్లో ఇది అత్యధికం
.
¤ ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య ఎగుమతులు మొత్తం 179.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 45.9 శాతం వృద్ధిని సూచిస్తోంది. దిగుమతులు అదే ఏడు నెలల కాలంలో 30.9 శాతం మేరకు పెరిగి 273.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు 93.7 బిలియన్ డాలర్లకు విస్తరించింది. 
డిసెంబరు 2 
¤ రాష్ట్ర అప్పులు 2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,32,805 కోట్లకు చేరాయి. 2007-08 కి ఈ రుణం రూ.97వేల కోట్లు కాగా, 2008-09 కి రూ.1.06 లక్షల కోట్లు, 2009-10 కి రూ1.19 లక్షల కోట్లకు చేరింది.
¤ దేశంలోని 28 రాష్ట్రాల మొత్తం అప్పు రూ.17.83 లక్షల కోట్లు కాగా రూ.2.24 లక్షల కోట్ల అప్పుతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌పై రూ.2.23 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్‌పై రూ.1.90 లక్షల కోట్లు, గుజరాత్ పై రూ.1.36 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ వరుసలో మన రాష్ట్రం అయిదో స్థానాన్ని ఆక్రమించింది
.
¤ ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనా పార్లమెంటులో ఈ వివరాలు వెల్లడించారు
డిసెంబరు 5 
¤ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కింద ఏడాదికి రూ.లక్ష వరకూ డిపాజిట్లను అనుమతించాలని బ్యాంకులను రిజర్వు బ్యాంకు కోరింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని 25 బ్యాంకులు పీపీఎఫ్ పథకం కింద డిపాజిట్లను స్వీకరిస్తున్నాయి.
¤ పీపీఎఫ్ వార్షిక పొదుపు పరిమితిని ఇటీవల ప్రభుత్వం రూ.70 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. వడ్డీ రేటును కూడా 8 శాతం నుంచి 8.6 శాతానికి సవరించింది. శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా వడ్డీరేటు పెంపు నిర్ణయం తీసుకున్నారు
.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలలకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2,35,333 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే కాలం వసూళ్లు రూ.2,16,628 కోట్లతో పోలిస్తే 8.63 శాతం పెరిగాయి
.
¤ ఏప్రిల్- నవంబరు నెలల్లో స్థూల పన్ను వసూళ్లు 19.56 శాతం పెరిగి, రూ.2,54,268 కోట్ల నుంచి రూ.3,04,002 కోట్లకు చేరాయి. ఈ కాలంలో ఆదాయపు పన్ను విభాగం రూ.68,669 కోట్లను రిఫండ్ చేసింది.
¤ ఏప్రిల్- నవంబరు నెలలకు స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 19.61 శాతం పెరిగి రూ.1,66,638 కోట్ల నుంచి రూ. 1,99,317 కోట్లకు, నికర వసూళ్లు 5.65 శాతం పెరుగుదలతో రూ.1,46,279 కోట్లకు చేరాయి
.
¤ స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 19.44 శాతం వృద్ధితో రూ.1,04,176 కోట్లకు, నికర వసూళ్లు 14 శాతం పెరుగుదలతో రూ.88,567 కోట్లకు పెరిగాయి. 
డిసెంబరు 9 
¤ అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురవడంతో నవంబరు నెలలో భారత ఎగుమతులు 22.3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. దిగుమతులు మాత్రం 35.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 13.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
¤ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ - నవంబరు) దేశ ఎగుమతులు 192.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 309.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 116.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది
.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో పరోక్ష పన్ను వసూళ్లు 16.8 శాతం వృద్ధితో రూ.2,52,544 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-నవంబరులో ఎక్సైజ్ సుంకాల వసూళ్లు రూ.94,441 కోట్లకు చేరుకున్నాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు రూ.1,00,062 కోట్లుగా నమోదయ్యాయి. డిసెంబరు
 11
¤ గెయిల్ ఇండియా 20 సంవత్సరాల పాటు ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్‌జీ) కొనుగోలుకు అమెరికా సంస్థ సబైన్‌పాస్ లిక్విఫాక్షన్ ఎల్ఎల్‌సీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటా 3.5 మిలియన్ టన్నుల చొప్పున ఎల్ఎన్‌జీని ఇరవై ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది
డిసెంబరు 12
¤ అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు పరిశ్రమలను దెబ్బతీయడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) అనూహ్యరీతిలో పతనమైంది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది అక్టోబరులో ఐఐపీ 5.1 శాతం వ్యతిరేక వృద్ధిని నమోదు చేసింది.
¤ 2010 అక్టోబరులో ఐఐపీ, అంతకు ముందు ఏడాది అక్టోబరుతో పోల్చినపుడు 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ, ఈ ఏడాది అక్టోబరులో మాత్రం, 2010 అక్టోబరుతో పోల్చినపుడు మైనస్ 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది
డిసెంబరు 16 
¤ రిజర్వ్ బ్యాంకు మధ్యంతర పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. ద్రవ్యోల్బణ కట్టడి కోసం మార్చి 2010 నుంచి 13 సార్లు కీలక రేట్లను పెంచిన రిజర్వు బ్యాంకు ఈసారి రేట్లలో ఏ మార్పూ చేయలేదు.
¤ దీంతో రెపో రేటు 8.5 శాతం, రివర్స్ రెపో 7.5 శాతం, సీఆర్ఆర్ 6 శాతం వద్దే ఉండిపోయాయి
డిసెంబరు 18 
¤ రాష్ట్రాల తలసరి ఆదాయాలను ప్రణాళికా సంఘం విశ్లేషించింది. రాష్ట్రంలో 2010-11లో తలసరి ఆదాయం రూ.60,458గా తేలినట్లు ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2010-11లో దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు తలసరి ఆదాయం రూ.54,835. 
డిసెంబరు 20 
¤ లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువ హోదాను భారత స్టాక్ మార్కెట్ కోల్పోయింది. రూపాయి క్షీణత వల్ల స్క్రిప్‌ల ధరలు పతనం కావడంతో మార్కెట్ విలువ 994.97 బిలియన్ డాలర్ల (రూ.52,60,440.78 కోట్ల) కు పరిమితమైంది. 
డిసెంబరు 30 
¤ 2010-11లో రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతులు రూ.35,022 కోట్లకు చేరాయి. 2009-10 ఎగుమతులు రూ.33,482 కోట్లతో పోలిస్తే 4.6 శాతం వృద్ధి లభించింది. దేశీయ ఐటీ రంగంలో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. 2010-11లో దేశీయ ఐటీ ఎగుమతులు రూ.2,52,374 కోట్లలో రాష్ట్రవాటా 13.9 శాతం.
¤ రాష్ట్రం నుంచి వివిధ రంగాల్లో జరిగిన మొత్తం ఎగుమతులు రూ.91,614 కోట్లలో ఐటీ వాటా 38.22 శాతం. రాష్ట్రంలో 2010లో 44 కొత్త ఐటీ యూనిట్లు ఏర్పాటవగా, 2011లో కొత్తగా నెలకొల్పినవి 46.

నవంబరు 2011 - ఆర్థికరంగం

నవంబరు 3 
¤ డిపాజిట్ చేసిన మొత్తం రెట్టింపు అయ్యేవిధంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 'డబుల్ పేరుతో సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత వడ్డీరేట్ల ప్రకారం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం 87 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇది 13.84% రాబడికి సమానం.
¤ అదే సీనియర్ సిటిజన్స్‌కైతే కేవలం 83 నెలల్లో రెట్టింపు అవుతుంది.వీరికి 14.56% రాబడి లభించనుంది
.
¤ కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.10,000 ఆ పైన రూ.1,000 చొప్పున గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు
నవంబరు 5 
¤ 2010-11 ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 341 లక్షల టన్నుల సేకరణ జరగ్గా, అందులో 96.10 లక్షల టన్నులను ఒక్కఆంధ్రప్రదేశే సేకరించింది. 86.34 లక్షల టన్నులతో పంజాబ్ రెండో స్థానంలో, 37.40 లక్షల టన్నులతో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో నిలిచాయి
నవంబరు 7 
¤ రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 1983-84 నుంచి 2010-11 వరకు ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం రుణం రూ. 10,696 కోట్లు.
¤ ఆంధ్రప్రదేశ్‌కున్న మొత్తం రుణ బాధ్యతల్లో ప్రపంచ బ్యాంకు వాటా7.82 శాతం మాత్రమే కావడం గమనార్హం.
¤ ఐబీఆర్‌డీ( అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు), ఐడీఏ(అంతర్జాతీయ అభివృద్ధి సంఘం) ద్వారా రెండు రకాల అప్పులను ప్రపంచ బ్యాంకు ఇస్తోంది. మధ్య తరహా ఆదాయం గల దేశాలకు ఐబీఆర్‌డీ ద్వారాను, పేద దేశాలకు ఐడీఏ ద్వారా రుణాలు అందుతాయి. ఐబీఆర్‌డీ ద్వారా ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం 6.94% వడ్డీతో పాటు మరికొన్ని రుసుములు కూడా ఉండగా, ఐడీఏ రుణానికి మాత్రం వడ్డీకి బదులు స్వల్పంగా ఇతర రుసుములే ఉంటాయి. రాష్ట్రానికి ఈ రెండు రకాలుగానూ రుణాలు అందుతున్నాయి. మొదటి రకం రుణాన్ని 20 ఏళ్లలోను, రెండో రకం రుణాన్ని 35 ఏళ్ల వ్యవధిలోను చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 
నవంబరు 8 
¤ యూరో జోన్ సంక్షోభ ప్రభావం మన ఎగుమతులపై పడింది. భారత ఎగుమతులు అక్టోబరులో 19.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఖరీదైన ముడి చమురు కారణంగా దిగుమతులు 39.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ పరిణామాలతో వాణిజ్య లోటు 19.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
¤ జూలైలో 82% వృద్ధిని నమోదు చేసుకున్న ఎగుమతులు ఆగస్టులో 44.25 శాతం, సెప్టెంబరులో 36.36%, అక్టోబరులో 10.8% మేర పెరుగుతూ వచ్చాయి. ఏరంగంలో చూసినా గత మూడు నెలల్లో ఇది తక్కువ వృద్ధి అని వాణిజ్య కార్యదర్శి రాహుల్ ఖుల్లార్ పేర్కొన్నారు.
¤ ఆర్థిక వ్యవస్థ మందగించడం, కొద్ది నెలల క్రితం పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వంటి కారణాలతో అక్టోబరు నెలకు పరోక్ష పన్ను వసూళ్లు 2.5 శాతం తగ్గి రూ. 30,278 కోట్లకు పరిమితమయ్యాయి.
¤ ఏడాది క్రితం ఇదే నెలలో ఈ వసూళ్లు రూ. 31,058 కోట్లు ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పరోక్ష పన్ను వసూళ్లలో కస్టమ్స్, ఎక్సైజ్, సేవల పన్ను ఆదాయం ఉంటుంది.
¤ అక్టోబరు నెలకు కస్టమ్స్ పన్ను వసూళ్లు 11.6 శాతం తగ్గి రూ. 12,849 కోట్ల నుంచి రూ. 11,357 కోట్లకు పరిమితమయ్యాయి. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం వసూళ్లు 5.3 శాతం తగ్గి రూ. 10,527 కోట్లకు చేరాయి. సేవల పన్ను వసూళ్లు మాత్రం 18.4 శాతం పెరిగి రూ. 7,089 కోట్ల నుంచి రూ. 8,394 కోట్లకు పెరిగాయి. 
నవంబరు 9 
¤ భారత బ్యాంకింగ్ వ్యవస్థ రేటింగ్‌ను 'స్థిరత్వం' నుంచి 'ప్రతికూలా'నికి సవరించనట్టు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ప్రకటించింది.
¤ ''మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ ఇక్కడి బ్యాంకుల ఆస్తుల, మూలధనం, లాభాదాయకతలపై ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్తుపై అంచనాలను సవరించాం" అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, విశ్లేషకుడు వినీత్ గుప్తా ప్రకటించారు.
¤ ''బ్యాంకింగ్ వ్యవస్థ రేటింగ్‌ను తగ్గించినప్పటికీ స్థిరంగా డిపాజిట్లు సమకూర్చే ఖాతా దారులు, ప్రభుత్వ వాటా బ్యాంకులకు సానుకూల అంశాలు. ఈ రెండూ బ్యాంకులకు నిధుల కొరత రానివ్వవు. ఒడుదొడుకులు కలిగించే అస్థిరత్వం నుంచి బ్యాంకులను కాపాడతాయని మూడీస్ పేర్కొంది.
¤ గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రేటింగ్‌ను మూడీస్ తగ్గించిన విషయం తెలిసిందే. దేశంలో 15 వాణిజ్య బ్యాంకులకు మూడీస్ రేటింగ్ ఇస్తోంది 20011 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆస్తుల్లో వీటి వాటా దాదాపు 66 శాతం ఉంది. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే పై చేయి. 
నవంబరు 10 
¤ ప్రముఖ రేటింగ్స్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ & పీ) భారతీయ బ్యాంకింగ్ రంగానికి రేటింగ్‌ను మెరుగు పరచింది. ఈ సంస్థ భారత బ్యాంకింగ్ రంగంలో రిస్క్ ప్రొఫైల్ (బ్యాంకింగ్ ఇండస్ట్రీ) కంట్రీ రిస్క్ అసెస్‌మెంట్స్- బైక్రా)ను ఒక అంచె మేరకు పెంచి 'గ్రూప్ 6' నుంచి 'గ్రూప్ 5' కు చేర్చింది.
¤ మరో రేటింగ్ సంస్థ 'మూడీస్ ఒక రోజు క్రితమే భారతీయ బ్యాంకింగ్ రంగ అవుట్‌లుక్ ను 'స్థిరత్వం' నుంచి 'ప్రతికూలానికి' జార్చిన విషయం విదితమే.
¤ (బైకా) గ్రూప్5లో ఉన్న ఇతర దేశాలలో చైనా, పోర్చుగల్, థాయ్‌లాండ్, టర్కీలు ఉన్నాయి. 
నవంబరు 11 
¤ యూనియన్ బ్యాంక్ తమ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా 111 కొత్తశాఖలను ప్రారంభించింది. 11-11-2011 తేదీని పురస్కరించుకొని 111 కొత్తశాఖలను ప్రారంభించింది.
¤ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొవాలని, దక్షిణాసియా అంతటా ఆంక్షలులేని సరళీకృత వాణిజ్య విధానాలను తీసుకురావాలని సార్క్ సదస్సు తీర్మనించింది.
¤ రెండు రోజుల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సార్క్ దేశాలు సంయుక్తంగా ''అద్దూ ప్రకటన" పేరుతో ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. సార్క్‌దేశాలు మధ్య రైల్వే, నౌక మోటారు వాహనాల రాకపోకలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ ప్రకటన పేర్కొంది.
¤ మరో వైపు, ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా స్పదించే వ్యవస్థ ఏర్పాటు, విత్తనాల బ్యాంకును నెలకొల్పడం, మత్తుపదార్థాలు, వ్యక్తుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తదితర అంశాలతో కూడిన సార్క్ ఒప్పందంపై సార్క్ దేశాధినేతలు సంతకాలు చేశారు.
¤ ప్రధాని మన్మోహాన్ సింగ్ నేపాల్ ప్రధాని బాబూరాం భట్టారాయ్, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు.
నవంబరు 16 
¤ స్విట్జర్లాండ్‌కి చెందిన గడియారాల బ్రాండ్ ఫావ్రే లూబాను 2 మిలియన్ యూరోల (రూ.13 కోట్ల) తో టైటన్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనుంది. 1737లో స్థాపించిన ఫ్రావ్రే లూబాకు ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్ర ఉంది.
నవంబరు 17 
¤ విశాఖపట్నంలో రూ. 11,196 కోట్ల పెట్టుబడితో భారీ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌కు చెందిన అమెరిండ్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
¤ ఈ ప్రాజెక్టును పెట్రోలియం కెమికల్స్ పెట్టుబడుల ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం విశాఖజిల్లా అచ్యుతాపురంలో వెయ్యి ఎకరాల భూమితోపాటు మెగా ప్రాజెక్టు కింద పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
¤ రాష్ట్రంలో ఏర్పాటయ్యే మొట్టమొదటి ప్రైవేటు రిఫైనరీ ఇదేనని, దీనిద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నులు, సర్‌ఛార్జి రూపేణా రూ. 15,444 కోట్ల ఆదాయం వస్తుందని, ఒక్క రాష్ట్రానికైతే రూ. 7,122 కోట్ల ఆదాయం ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి చెప్పారు.
¤ ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ, కార్పొరేట్ బాండ్లలోనూ విదేశీ సంస్థాగత మదుపుదార్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల పరిమితిని చెరి 5 బిలియన్ డాలర్ల (రూ. 25 వేల కోట్లు) మేర పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. భారత కార్పొరేట్లకు వనరుల లభ్యతను పెంచడంతోపాటు దేశానికి మూలధన నిధుల ప్రవాహాన్ని ఇది అధికం చేయగలదు.
¤ తాజా నిర్ణయంతో ఎఫ్ఐఐలు ఇకపై ప్రభుత్వ సెక్యూరిటీలలో 15 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టవచ్చు.
¤ కాగా, దీర్ఘకాల మౌలిక బాండ్లలో పెట్టుబడులు పరిమితిలో ఎలాంటి మార్పు లేకుండా 25 బిలియన్ డాలర్ల వద్దే ఉంచారు.
¤ ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరిమితి రూ. 43,650 కోట్లు కాగా అక్టోబరు 31, 2011 నాటికి వారు రూ. 41,253 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇదేవిధంగా కార్పొరేట్ బాండ్లలో పరిమితి రూ. 74,416 కోట్లు ఉండగా గత నెలాఖరు నాటికి రూ. 68,289 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 
నవంబరు 21 
¤ రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.52.16 ధరకు పడిపోయింది. గత 33 నెలల కాలంలో ఇదే కనిష్ఠ ధర (2009 మార్చి 12న రూ. 52.20గా నమోదైంది). ఈ ఏడాది ఆగస్టు 2న రూపాయి మారకం విలువ రూ.44.07 కాగా అప్పట్నుంచే విలువ క్షీణత మొదలై ఇప్పుడు కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
¤ రూపాయి పతనానికి ప్రధాన కారణం అమెరికా, ఐరోపా దేశాల్లో నెలకొని ఉన్న అననుకూల ఆర్థిక వాతావరణమే. అప్పులు కట్టలేక గ్రీస్ చేతులెత్తేయటం, రెండు ఫ్రెంచ్ బ్యాంకుల రేటింగ్ తగ్గిపోవడంతో ఐరోపా దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో యూరో విలువ క్షీణించి, డాలర్ బలపడింది. ఇదే ప్రభావం ఇతర దేశాలపై పడి ఆయా దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ఈ పరిస్థితులే రూపాయి మీద కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో స్టాక్ మార్కెట్ల నుంచి మదుపుదార్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సర్వసాధారణం.
¤ ఇక మన దేశంలో సమస్యలు భిన్నంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం కుంగదీస్తోంది. ఎన్నో నెలల నుంచి ఇది తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో వడ్డీరేట్లు పెరిగాయి. సరకులు, ముడి పదార్థాలు ఖరీదైపోయాయి. తత్ఫలితంగా పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఎగుమతులు పడిపోయాయి. అదే సమయంలో అధిక దిగుమతులు తప్పడం లేదు. దీనివల్ల వాణిజ్య లోటు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దిగుమతులకు పెద్ద ఎత్తున డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో మన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (విదేశీ మారక నిల్వ) తరిగిపోతోంది. మరో పక్క అధిక ముడిచమురు ధర వేధిస్తూనే ఉంది. ఇంటా బయటా అన్ని పరిస్థితులూ ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయి రూపాయి మారకం విలువ వేగంగా క్షీణిస్తోంది.
¤ రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండటం ఎంతో అవసరం. ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనయ్యే పక్షంలో ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. పెరిగినా, తగ్గినా దిగుమతులు - ఎగుమతులు ఖరీదైపోతాయి. సంబంధిత రంగాల్లోని సంస్థలకు ఇబ్బందులే. రూపాయి విలువ గణనీయంగా క్షీణించిన ప్రస్తుత పరిస్థితుల్లో దిగుమతి చేసుకునే మందులు, నిత్యావసర వస్తువులు, నూనెలు, ఎరువులు ఖరీదైపోతున్నాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి చేసుకోవడం కష్టమైపోతుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా ఈ పరిస్థితి పెను భారమే. రూపాయి బలహీనత వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి, పరోక్షంగా సామాన్యులకు దీని వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. 
నవంబరు 28 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12)లో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.6 శాతానికి పరిమితం కావచ్చని ప్యారిస్‌కు చెందిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) అనే సంస్థ అంచనా వేసింది. ఓఈసీడీలో 34 దేశాలకు సభ్యత్వం ఉంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన వృద్ధిరేటు 8.8 శాతంగా ఉంది. 
నవంబరు 29 
¤ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 2004-05 నుంచి 2010-11 వరకు నమోదైన వృద్ధి రేట్లను ప్రణాళిక సంఘం తాజాగా విశ్లేషించింది. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల సగటు 8.71 శాతంగా తేలింది. జాతీయ సగటు (8.45 శాతం) కంటే ఇది కొంచెం ఎక్కువ. ఇదే సమయంలో 17 రాష్ట్రాల్లో 8.73 నుంచి 13.19 శాతం వరకు వృద్ధి కనిపించింది.
¤ 12వ పంచవర్ష ప్రణాళిక కాలం (2012-17)లో సగటున 10 శాతం వృద్ధిని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. గత ఏడేళ్లలో సగటు వృద్ధి రేటు 8.71 శాతం ఉన్నట్లు తేలిన నేపథ్యంలో తన లక్ష్య సాధనకు ప్రభుత్వం చాలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 
నవంబరు 30 
¤ అంతర్జాతీయ ఆర్థిక ఒడుదొడుకులతో నలిగిపోతున్న ప్రపంచ బ్యాంకింగ్ రంగానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా 15 బ్యాంకుల రేటింగ్‌ను స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) తగ్గించింది. వీటిలో అమెరికాకు చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో బ్యాంకులు ఉన్నాయి. ఐరోపా దిగ్గజ బ్యాంకులు హెచ్ఎస్‌బీసీ, లాయిడ్స్, బ్యాంకింగ్ గ్రూప్, ఆర్‌బీఎస్ (రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్) రోబో బ్యాంక్, బార్‌క్లాస్ రేటింగ్‌లను కూడా ఎస్ అండ్ పీ తగ్గించింది.
¤ బీఎస్‌పీ పారిబస్, క్రెడిట్ అగ్రికోల్, డాయిష్ బ్యాంకుల రేటింగ్‌లను యథాతథంగా కొనసాగించింది.
¤ ప్రపంచ వ్యాప్తంగా 37 బ్యాంకుల రేటింగ్‌ను సమీక్షించిన ఎస్ అండ్ పీ చైనాకు చెందిన బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకుల రేటింగ్‌లను పెంచడం విశేషం. సమీక్షించిన బ్యాంకుల్లో భారత బ్యాంకులు లేవు.
¤ ప్రపంచ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ - పరిశోధన అభివృద్ధి) రంగంలో సంచలనం సృష్టిస్తున్న కంపెనీలతో యూరోపియన్ కమిషన్ (ఈసీ) రూపొందించిన జాబితాలో 18 భారతీయ కంపెనీలు చోటు పొందాయి. వీటిలో భారతీయ దిగ్గజాలన్నింటినీ తోసిరాజని టాటా మోటర్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. పరిశోధనలు, సృజనాత్మక కార్యకలాపాలపై భారీ పెట్టుబడుల ప్రాతిపదికగా ఈ జాబితాను రూపొందించారు. తర్వాతి స్థానాల్లో పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్, పొలారిస్ సాఫ్ట్‌వేర్, బిహెచ్ఇఎల్ మహీంద్రా అండ్ మహీంద్రాలు నిలిచాయి.
¤ భారతీయ కంపెనీల జాబితాలో తర్వాతి స్థానాల్లో కేపీఐటీ కమిన్స్ ఇన్ఫో (6), జైలాగ్ సిస్టమ్స్ (7), డాక్టర్ రెడ్డీస్(8), లుపిన్(9), ఇన్ఫోసిస్ (10), రిలయన్స్ ఇండస్ట్రీస్ (11), కోర్ ప్రాజెక్ట్స్ (12), భారత్ ఎలక్ట్రానిక్స్ (13), అశోక్ లేల్యాండ్ (14), సిప్లా (15), సన్ ఫార్మా (16), ఓఎన్‌జీసీ (17), ఎఫ్‌సిఎస్ సాఫ్ట్‌వేర్ (18) ఉన్నాయి.
¤ గ్లోబల్ ఆర్ ఆండ్ డి జాబితాలో మాత్రం టాటా మోటార్స్ ర్యాంకు 264 కావడం గమనార్హం. మిగిలిన 17 భారత కంపెనీలు 300 నుంచి 1400 ర్యాంకుల మధ్యలో ఉన్నాయి.
¤ గ్లోబల్ టాప్-5 కంపెనీల జాబితాలో మూడు ఫార్మా కంపెనీలే. స్విస్ ఫార్మా దిగ్గజం రోచ్ జాబితాలో ప్రథమ స్థానం దక్కించుకుంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ రెండో స్థానంలో నిలిచింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడో స్థానాన్ని పొందింది. జపనీస్ ఆటో దిగ్గజం టొయోటో నాలుగో స్థానం, ఔషధ కంపెనీ మెర్క్ అయిదో స్థానాన్ని పొందాయి.
¤ కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) ప్రకటించిన వృద్ధి గణాంకాల ప్రకారం జులై - సెప్టెంబరు కాలానికి భారత వృద్ధి 6.9 శాతంగా నమోదైంది (గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ వృద్ధి 8.4%). ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్‌లో వృద్ధిరేటు 7.7 శాతం నమోదైంది.
¤ ప్రభుత్వం వెలువరించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో జీడీపీ 7.3%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఆరు నెలల కాలంలో వృద్ధి 8.6%గా ఉంది. 
¤ 2011-12 తొలి ఏడు నెలల్లో భారత ద్రవ్యలోటు రూ. 3.07 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యం రూ.4.128 లక్షల కోట్లలో ఇది 74.4 శాతానికి సమానం.
¤ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్- అక్టోబరులో మొత్తం పన్ను వసూళ్లు 18% వృద్ధితో రూ.3.73 లక్షల కోట్లుగా నమోదు కాగా, ప్రభుత్వ వ్యయాలు 10% వృద్ధితో రూ.6.804 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో ద్రవ్యలోటు రూ.3.07 లక్షల కోట్లకు చేరింది.

అక్టోబరు 2011 - ఆర్థికరంగం

అక్టోబరు 4 
¤ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ద్రవ్యసామర్థ్య రేటింగ్‌కు అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించింది. తక్కువగా ఉన్న టైర్-1 మూలధన నిష్పత్తితో పాటు ఆస్తుల నాణ్యత క్షీణించే అవకాశం ఉన్నందున రేటింగ్‌ను ఒక అంచె తగ్గించినట్లు మూడీస్ తెలిపింది.
¤ బ్యాంక్ ద్రవ్య సామర్థ్య రేటింగ్ (బీఎఫ్ఎస్ఆర్)ను 'సి- నుంచి 'డి+కు సవరించినట్టు వెల్లడించింది

అక్టోబరు 10 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరనికి భారత వృద్ధిరేటు అంచనాను క్రిసిల్ తగ్గించింది. గతంలో 8 శాతం వృద్ధిరేటు సాధించగలదని భావించగా తాజాగా దాన్ని 7.6 శాతానికి సవరించింది
అక్టోబరు 19 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ 7-8% వృద్థి చెందగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది
అక్టోబరు 25 
¤ రిజర్వు బ్యాంకు పరపతి విధాన సమీక్షను ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే లక్ష్యంతో వసుసగా 13వ సారి రెపోరేటును పావుశాతం పెంచి 8.5 శాతానికి సవరించారు. రివర్స్ రెపోరేటు 7.5 శాతం ఉంటుంది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 6 శాతం వద్ద, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎన్ఎల్ఆర్) 24 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతాయి.
¤ ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాలను 8 శాతం నుంచి 7.6 శాతానికి సవరించారు.

సెప్టెంబరు 2011 - ఆర్థికరంగం

సెప్టెంబరు 5 
¤ ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఎస్‌బీఐ, బీఎస్‌పీ పారిబస్‌ల (74:26) సంయుక్త సంస్థే ఇది. 'హాస్పిటల్ క్యాష్ అనే పేరుతో పథకాన్ని ప్రకటించింది. దీనికింద బీమా తీసుకున్న వ్యక్తికి ఆసుపత్రి బిల్లుతో సంబంధం లేకుండా ఆసుపత్రి పాలైన ప్రతీ రోజుకు ఒక స్థిర మొత్తాన్ని అందజేస్తారు. ఈ పథకం ప్రకారం పాలసీ టర్మ్ మూడేళ్లుగా ఉంటుంది. 
సెప్టెంబరు 9 
¤ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు 'స్విఫ్ట్ పేరుతో వ్యక్తిగత రుణాలకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఖాతాదారుడి నుంచి అన్ని పత్రాలు అందుకున్న 24 గంటల్లో (వర్కింగ్ అవర్స్) మంజూరు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది.
¤ ఆరోగ్య సంరక్షణకు 12వ ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2012-17 కాలానికి ఆరోగ్య సంరక్షణ రంగంపై వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచనున్నట్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది దాదాపు ఒక శాతంగా ఉంది. 
సెప్టెంబరు 12 
  ¤ దేశ పారిశ్రామిక వృద్ధి జూలైలో కేవలం 3.3 శాతానికి పరిమితమై నిరుత్సాహపరిచింది. గత 21 నెలల్లో ఇదే కనిష్ఠస్థాయి, యంత్ర పరికరాలు వస్తూత్పత్తి గనుల తవ్వకం రంగాల పేలవమైన పనితీరు పారిశ్రామికవృద్ధి నమోదైంది. 2010 జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ 9.9 శాతం వృద్ధి చూపింది. 
సెప్టెంబరు 14 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తగ్గించింది. గతంలో 8.2 శాతం వృద్ధిరేటు నమోదు కాగలదని అంచనా వేయగా దీన్ని తాజాగా 7.9 శాతానికి పరిమితం చేసింది.
¤ 2012 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగలదని పేర్కొంది. గతంలో ఇది 7.8 శాతానికి తగ్గగలదని అంచనా వేసింది.
¤ ఈ ఏడాది, వచ్చే ఏడాదిలో ఆసియాలోని వర్థమాన దేశాలు ఊహించినదానికన్నా తక్కువ వృద్ధిరేటును నమోదు చేయనున్నామని ఏడీబీ వెల్లడించింది. ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థలు సగటున ఈ ఏడాది (2011) 7.8 శాతం వృద్ధి చెందగలవని ఏప్రిల్‌లో అంచనా వేయగా దీన్ని 7.5 శాతానికి తగ్గించింది. 2012 ఏడాది వృద్ధిరేటును 7.7 శాతం నుంచి 7.5 శాతానికి సవరించింది. 
సెప్టెంబరు 16 
¤ ఆస్ట్రేలియాలో 3 బొగ్గు గనులతో పాటు ఒక రైల్వే లైనునౌకాశ్రయం ప్రాజెక్టులభాగస్వామ్యానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీవీకే గ్రూపు ప్రకటించింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ నెలల మధ్యరాష్ట్రస్థూల ఉత్పత్తి 8.49 శాతం వృద్ధి రేటు నమోదయిందిఇదే వ్యవధిలో జాతీయస్థాయిలో 7.74 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది.
¤ రాష్ట్రంలో వ్యవసాయంపరిశ్రమల రంగాలు జాతీయ స్థాయి కంటే అధిక ప్రగతినికనబరిచాయిసేవారంగం మాత్రం వెనుకబడిందివ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధిరేటు10.83 శాతం కాగా జాతీయ స్థాయి వృద్ధిరేటు 3.93గా నమోదయిందిరాష్ట్రంలోపరిశ్రమల రంగం వృద్ధిరేటు 7.52 శాతం కాగాజాతీయ స్థాయిలో 5.10 శాతంవృద్ధిరేటు నమోదు అయిందిఇక సేవల రంగంలో రాష్ట్ర వృద్ధిరేటు 8.57 శాతం,జాతీయ స్థాయి వృద్ధిరేటు 10 శాతం.
¤  ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో వ్యవసాయపారిశ్రామికసేవల రంగాల్లోకలిపి రూ.74,509 కోట్ల విలువైన ఉత్పత్తులు ఉన్నట్లు అర్థ గణాంక శాఖ అంచనావేసిందిగత ఏడాది ఇదే వ్యవధిలో వీటి విలువ రూ.68,681 కోట్లు.
¤ ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మధ్యంతర పరపతి విధాన సమీక్షనుముంబయిలో ప్రకటించారు.
¤ పారిశ్రామిక వర్గాలుబ్యాంకర్లు ఊహించిన విధంగానే నగదు లభ్యతను మరింతతగ్గించడానికి ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేటైన రెపో రేటును పావు శాతం పెంచి8.25 శాతానికి సవరించిందిదీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 0.25 శాతం పెరిగి7.25 శాతం అవుతుంది.
¤ ఈసారి కూడా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), చట్టపరమైన లిక్విడిటీ నిష్పత్తి(ఎస్ఎల్ఆర్వంటి ఇతర సాధనాల జోలికి కేంద్ర బ్యాంకు పోకపోవడం గమనార్హం.దాదాపు గత ఏడాదిన్నర కాలంలో కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు పెంచడం ఇదిపన్నెండోసారి.
¤ అయితే వడ్డీ రేట్లు ఇంతగా పెంచుతున్నా ద్రవ్యోల్బణం మాత్రం ఎక్కడా తగ్గుముఖంపడుతున్న దాఖలాలు లేక పోవడం ఆందోళనకరమైన అంశంగత 13 నెలల కాలంలోనెలవారీగా ద్రవ్యోల్బణం గణాంకాలను చూస్తేఇది 8.20 నుంచి 9.78 శాతం మధ్యనమోదవుతూ వచ్చిందిఅంటే పెద్ద మార్పు లేకుండా స్థిరంగా 8 - 9.8 శాతం ఉంటూవస్తున్నట్లు స్పష్టమౌతోందిఅదే సమయంలో రెపోరివర్స్‌రెపో రేట్లు దాదాపు 4శాతం నుంచి 8.25 శాతం వరకూ పెరిగాయిఅయినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గలేదంటేకేవలం నగదు సరఫరా మాత్రమే కాదు... ఇంకా బలమైన కారణాలేవో పనిచేస్తున్నాయనే భావించాల్సి వస్తోందిఇటువంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం అదుపులోకిరావాలంటే సరకుల సరఫరా గణనీయంగా పెరగాలనిమరోదారి లేదని ఆర్థికనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
¤ ఏదేమైనప్పటికీ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్యప్రజానీకం పై పెనుభారం పడుతోంది రుణాలు తీసుకుని ఇళ్లువాహనాలు కొనుగోలుచేసిన వారుబ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారు అదనపు వడ్డీ భారాన్నిమోయలేక సతమతం అవుతున్నారుమరోపక్క మండిపోతున్న నిత్యావసరాలు,కూరగాయల ధరలు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న దాఖలాలే లేవని స్పష్టంచేస్తున్నాయిఇదే సమయంలో చమురు ధరలను పెంచుతూ ప్రభుత్వం ప్రజలపైమరింత భారాన్ని మోపుతోంది.
రెపోరివర్స్ రెపో రేట్లు గత 12 దఫాలుగా పెరిగిన తీరు బేసిక్ పాయింట్లలో
      తేదీ                                          రెపోరేటు                   రివర్స్‌రెపో రేటు
19 మార్చి 2010                           25(5.00)                 25(3.50)
20 ఏప్రిల్ 2010                            25(5.25)                 25(3.75)
02 ఆగస్టు 2010                           25(5.50)                25(4.00)
27 ఆగస్టు 2010                           25(5.75)                 50(4.50)
02 సెప్టెంబరు 2010                      25(6.00)                50(5.00)
02 నవంబరు 2010                      25(6.25)                 25(5.25)
25 జనవరి 2011                          25(6.50)                 25(5.50)
17 మార్చి 2011                           25(6.75)                  25(5.75)
03 మే 2011                                50(7.25)                 50(6.25)
16 జూన్ 2011                               25(7.50)                 25(6.50)
26 జులై 2011                               50(8.00)                 50(7.00)
16 సెప్టెంబరు 2011                        25(8.25)                 25(7.25)
¤ రెపోరేటుస్వల్ప కాలిక సర్దుబాటు నిమిత్తం ఆర్‌బీఐ నుంచి తీసుకున్న సొమ్ముపైబ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీరేటు.
¤ రివర్స్ రెపో రేటు బ్యాంకులు తమ వద్దనున్న మిగులు సొమ్మును ఆర్‌బీఐ వద్దపెట్టినపుడు లభించే వడ్డీరేటు.
¤ తదుపరి సమీక్ష అక్టోబరు 25 జరుగుతుంది
సెప్టెంబరు 19 
¤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన 12 ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖఆమోదించిందివిటి విలువ రూ.242.88 కోట్లు.

ఆగస్టు -2011 ఆర్థికరంగం

ఆగస్టు 1 
¤ భారత ఎగుమతులు జూన్‌లో 46.45 శాతం మేర పెరిగాయి. వాటి విలువ 29.21 బిలియన్ డాలర్లకు (సుమారుగా రూ.1,19,761 కోట్లకు) చేరుకొంది. అంతక్రితం సంవత్సరం జూన్ నెల వస్తురూప ఎగుమతులు 19.94 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.87,730 కోట్లు)గా నమోదయ్యాయి.
¤
 జూన్ ఎగుమతుల గణాంకాలు అందించిన దన్నుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎగుమతులు మొత్తం మీద 79 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3,55,500 కోట్లకు) పెరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన సమాచారం వెల్లడిస్తోంది.
¤
 జూన్ మాసంలో దిగుమతులు కూడా 42.4% ఎగబాకాయి. వాటి విలువ 36.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,65,600 కోట్లు)గా నమోదయింది.
ఆగస్టు 3 
¤ అంతర్జాతీయం
¤
 ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన ఇంగ్లక్ షనవత్రాను థాయ్‌లాండ్ పార్లమెంట్ దేశ ప్రథమ మహిళ ప్రధానమంత్రిగా లాంఛనంగా ఎన్నుకుంది. దిగువ సభలో మొత్తం 500 మంది సభ్యులుండగా 296 మంది సభ్యులు ఆమెకు మద్దతు ప్రకటించారు.
¤
 ఈ నేపథ్యంలో స్పీకర్ సోమసన్ షినవత్రాను నూతన ప్రధాన మంత్రిగా ప్రకటించారు.
¤
 నాటో దాడుల్లో లిబియా అధ్యక్షుడు గడాఫీ చిన్నకుమారుడు ఖామిస్ మరణించినట్లు తిరుగుబాటుదారులు వెల్లడించారు. ఈ దాడుల్లో మరో 31 మంది కూడా మరణించారని తెలిపారు. దీన్ని లిబియా ప్రభుత్వం ఖండించింది.
ఆగస్టు 5 
¤ హార్లే- డేవిడ్‌సన్ 'ఫ్యాట్ బోయ్' మోడల్‌లో కొత్త రకం బైక్‌ను విడుదలచేసింది. బైక్ ధర రూ.19.7 లక్షలు.
¤
 2009 ఆగస్టులో భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది.
ఆగస్టు 8  
¤ అమెరికా ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు పెరగడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు విలవిలలాడాయి. యూరప్ రుణ సమస్యల ప్రభావం తోడవడంతో ప్రపంచ షేర్ బజార్‌లు మూడు శాతం నష్టపోయాయి.
¤
 అమెరికా కొంప ముంచిన స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) రేటింగ్ సంస్థ భారత్ పైనా బాంబు పేల్చింది. భారత్ సహా ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాలకు మున్ముందు కష్టకాలం తప్పదని చెప్పింది.పనిలో పనిగా అమెరికాలో మరిన్ని ప్రభుత్వ సంస్థల పరపతి రేటింగును కుదించి వేసింది. వీటిలో ఫ్రెడ్డీ మ్యాక్, ఫ్యానీమ్, పది గృహరుణ బ్యాంకులు ఉన్నాయి.
¤
 బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ మొత్తం మీద 3416 పాయింట్ల నష్టంతో ముగిసింది.
¤
 ఒక వైపు మార్కెట్లు కుప్పకూలుతుంటే మరోవైపు బంగారం ధర ధగధగమంటోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఔన్సు 1700 డాలర్లకు, దేశీయంగా తులం రూ. 25,000కు, ఫ్యూచర్స్‌కురూ. 26,000కు చేరి చరిత్రను సృష్టించింది. ఆపత్కాలంలో సురక్షితమైన మదుపుగా భావించి, కొనుగోళ్లకు ఎగబడడమే పుత్తడి జోరుకు కారణమైంది 
ఆగస్టు 13 
¤ కాపర్ నికెల్ 50 పైసల నాణేలను, కాపర్ నికెల్ ఒక్కరూపాయి నేణేలను వెనక్కి తీసుకోవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. వాటి స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్ నాణేలను విడుదల చేయనుంది. కాపర్ నికెల్ రూ.2 నాణేలను ఇకపై విడుదల చేయకూడదని కూడా ఆర్‌బిఐ నిర్ణయించింది. 
ఆగస్టు 14 
¤ సంయుక్త ప్రయోజనాలున్న అంశాల్లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడం కోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), ఆయిల్ ఇండియాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 
ఆగస్టు 15 
¤ సెల్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మొబిలిటీని 1250 కోట్ల డాలర్లను కొనుగోలు చేయునున్నట్లు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పదం కుదుర్చుకున్నట్లు రెండు కంపెనీలు ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.
ఆగస్టు 17 
¤ గత ఆర్థక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 1.7 లక్షలు కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి మూడింతలై 5.6 లక్షల కోట్ల డాలర్లకు (ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం రూ. 252 లక్షల కోట్లు)చేరగలదని పరిశోదన సంస్థ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అంచనా వేస్తోంది. వేగంగా పెరుగుతున్న పెట్టుబడుల, వినియోగ వ్యయం, మౌలిక సదుపాయాలపై ఖర్చు దీనికి కారణమని తెలిసింది.
¤ 2009-10 ఏడాది జీడీపీలో సేవల రంగవాటా 57.3 శాతం ఉండగా 2019-20 నాటికి 61.8 శాతానికి చేరనుంది. డీఅండ్‌బీ నివేదిక 'ఇండియా 2020 లోని ముఖ్యాంశాలు:
¤ 2020 నాటికి మహరాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లు బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మారనున్నాయి. జీడీపీలో వీటి వాటా 32 శాతానికి పైగా ఉండు వీలుంది.
¤ ఈ దశాబ్దంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వాటా జీడీపీలో గణనియంగా పెరింగింది. 2019-20 నాటికి వీటి వాటా 21.1 నుంచి 24 శాతానికి చేరునుంది.
¤ ప్రభుత్వ విధాన నిర్ణయాలు తయారీ, రిటైల్‌రంగాలను బాగా ప్రోత్సహిస్తాయి.
¤ నేరుగా నగదు సబ్సిడీ చెట్లించడం, యూడీఐ, పర్యావరణ జాతీయ తయారీ విధానాలు, రిటైల్, బీమా వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత వృద్ధిరేటు నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి.
¤ కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం వృద్ధిరేటుకు ఉన్న అవరోధాలను తొలగిస్తుంది.
¤ స్వల్ప కాలానికి ద్రవ్యోల్బణం ఇబ్బంది కలిగించినా దీర్ఘ కాలానికి అదుపులోకి వస్తుంది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరనికి జీడీపీ వృద్ధిరేటు 8.1 శాతానికి పరిమితం కాగలదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా వేసింది. గతంలో ఈ వృద్థరేటు 8.6 శాతం ఉండగలదని పేర్కొంది.
¤ వ్యవసాయరంగం వృద్ధి రేటును 3.2 శాతం నుంచి పత్తి దిగుబడులు తగ్గగలవన్న అంచనాలే కారణం. పారిశ్రామిక వృద్ధి రేటును 8.9 శాతం నుంచి 8.6 శాతానికి పరిమితం చేసింది.
ఆగస్టు 19 
¤ వచ్చే ఏడాదికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తగ్గించింది. అధిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లలో బలహీన పరిస్థితులు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని 2011-12 ఏడాదికి వృద్ధిరేటును 7.8 శాతం నుంచి 7.4 శాతానికి పరిమితం చేసింది.
ఆగస్టు 21 
¤ దేశంలో అతిపెద్ద పది కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) గతవారం రూ.39,892.81 కోట్ల మేరకు తగ్గింది.
¤ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను తోసి రాజని మార్కెట్ విలువలో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. నాలుగేళ్లకు పైగా మొదటి స్థానంలో కొనసాగిన రిలయన్స్ రెండో స్థానానికి పడిపోయింది
.
¤ గతవారం కోల్ ఇండియా మార్కెట్ విలువ రూ.5,305.74 కోట్లు పెరిగి రూ.2,48,675.09 కోట్లకు చేరింది
.
¤ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంక్యాప్ రూ.9,691.84 కోట్ల మేరకు తగ్గి రూ.2,39,414.62 కోట్లకు పరిమితమైంది. 2010, నవంబరులో నమోదైనప్పటి నుంచి కోల్ ఇండియా పెరుగుతూనే ఉంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.15 కోట్లకు పైగా సమీకరించింది. ఈ షేర్లకు సంబంధించిన మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.1,50,000 కోట్లకు పైగా ఉంది
.
¤ కోల్ ఇండియా, రిలయన్స్ తర్వాత మార్కెట్ విలువ పరంగా ఓఎన్‌జీసీ మూడో స్థానంలో ఉంది
.
¤ మెర్సిడెజ్-బెంజ్ తన ప్రతిష్ఠాత్మకమైన జీక్లాస్ వాహన శ్రేణిలో విశిష్టమైన జీ -55 ఏఎంజీ వాహనాన్ని తాజాగా భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. మొదట్లో దీన్ని సైన్యం అవసరాల కోసం తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఎస్‌యూవీ విభాగంలో ఒక మోడల్‌గా పరిచయం చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది
.
¤ జీ-55 ఏఎంజీకి 5.5 లీటర్ల వీ-8 ఇంజిన్‌ను అమర్చారు. దీని గరిష్ఠవేగం గంటకు 210 కి.మీ కావడం విశేషం. దీని ధర సుమారు రూ. 1.50 కోట్లుగా ఉంటుంది
.
ఆగస్టు 22 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి 64,392 టన్నుల ముడి పొగాకు, పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.103.75 కోట్లు
¤ గత సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఎగుమతులు పరిమాణం పరంగా 9 శాతం, విలువ పరంగా 7 శాతం పెరిగాయి
.
¤ మన దేశం నుంచి ప్రధానంగా బెల్జియం, ఈజిప్టు, రష్యా, నెదర్లాండ్స్, జర్మనీ, యెమెన్, ఫిలిఫ్పైన్స్‌కి పొగాకు ఎగుమతులు జరుగుతాయి
.
¤ భారత పొగాకు బోర్డు ప్రస్తుత ఛైర్మన్ జి.కమలవర్ధనరావు
ఆగస్టు 23 
¤ వచ్చే అయిదేళ్లలో పారిశ్రామిక రంగంలో 10.5 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని నిర్ణయించినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికా సంఘానికి తెలియజేసింది.
¤ 2012 నుంచి ప్రారంభమయ్యే 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు మూడింటిలోనూ కలిపి 10 శాతం వృద్ధి రేటు సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యవసాయంలో 6 శాతం, పారిశ్రామిక రంగంలో 10.5 శాతం, సేవా రంగంలో 11.5 శాతం వృద్ధిని నమోదు చేయగలిగతేనే ప్రభుత్వం ఆశిస్తున్న 10 శాతం సాధ్యమవుతుంది
.
¤ ప్రస్తుత 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో ఇప్పటికే నాలుగేళ్లు గడచిపోయినా పారిశ్రామిక వృద్ధి లక్ష్య సాధనలో మాత్రం రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. ఈ ప్రణాళికలో 9.5 శాతం వృద్ధిని సాధించాల్సి ఉండగా 6.8 శాతంతో సరిపెట్టుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా 10.5 శాతం వృద్ధి రేటు వైపునకు దూసుకెళ్లాలంటే చాలా సమర్థవంతమైన ఏర్పాట్లను చేపట్టాల్సి ఉంటుంది
.
¤ రాష్ట్రాలు ఎలా వ్యవహరించాలో ప్రణాళిక సంఘం తన మార్గ నిర్దేశక పత్రం ద్వారా ఇప్పటికే తెలియజేసింది. బలహీనంగా ఉన్న తయారీ రంగాన్ని పటిష్ఠం చేసి ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించడం, పారిశ్రామిక విధానాలను సక్రమంగా అమలు చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది
.
¤ తాము ఆశిస్తున్న వృద్ధిరేటుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగానే ప్రణాళిక సంఘానికి ప్రభుత్వం నివేదించింది. 2010-15 మధ్య అమలయ్యే నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. 27 ప్రత్యేక ఆర్థిక మండళ్లు వచ్చే మూడేళ్లలో రూ. 12,296 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయనున్నాయని, వీటిలో 86,652 మందికి ఉపాధి లభించనుందని తెలిపింది. మన్నవరంలో ఇంధన పరికరాల ప్రాజెక్టుతో సహా అనేక పరిశ్రమలు వస్తున్నట్టు పేర్కొంది
.
¤ పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఇక భూ సేకరణ ప్రధానాంశం కానుంది. భూ సేకరణకు కొత్త చట్టం అమల్లోకి రావడం, పరిశ్రమలకు భూముల కేటాయింపుపై రాష్ట్ర స్థాయిలో కొన్ని విధివిధానాలను రూపొందించడం లాంటి కారణాల వల్ల పారిశ్రామిక విధానంలో భూములే ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి
.
¤ రాష్ట్రంలో గడచిన నాలుగేళ్లలో భూకేటాయింపు సమస్య పెద్దగా లేకున్నా ఇతర కారణాల వల్ల పారిశ్రామిక రంగం వృద్ధిరేటు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ముఖ్యంగా విద్యుత్తు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా తయారీ రంగాలు పెద్దగా పురోగమించలేదు
.
¤ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పరిశ్రమల రంగం వాటా 2007-08లో 25.53 శాతం ఉండగా 2010-11 నాటికి అది 24.73 శాతానికి తగ్గింది
ఆగస్టు 28 
¤ 2005-06 నుంచి 2010-11 ల మధ్య కాలంలో ఎనిమిది రకాల నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 72 శాతం పెరిగాయి. అదే సమయంలో సగటు భారతీయుడు తలసరి ఆదాయం మాత్రం 38 శాతం పెరిగినట్టు ఆసోచామ్ తన తాజా సర్వేలో వెల్లడించింది
ఆగస్టు 29 
¤ బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సీ)కు కఠినతరమైన కొత్త నియమ నిబంధనలను వర్తింపజేయాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్ నేతృత్వంలోని కమిటీ సూచించింది. బ్యాంకులకు వర్తిస్తున్న అకౌంటింగ్ నియమాలనే ఎన్‌బిఎఫ్‌సీ లకు వర్తింపజేయాలని ఈ బృందం పేర్కొంది. ఈ కమిటీ చేసిన సూచనలు
¤ రూ.1000 కోట్లకు మించిన ఆస్తులు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు అన్ని స్టాక్ ఎక్జేంజీల్లో నమోదైనా, నమోదు కాకపోయినా సెబీ నమోదు ఒప్పందంలోని 49వ క్లాజుకు లోబడి ఉండేలా చూడాలి
.
¤ ఎన్‌బీఎఫ్‌సీ లకు ప్రతి సంవత్సరం స్ట్రెస్ టెస్టులు, తనిఖీలు జరపాలి. దీనివల్ల అవి ఎంత వరకు కచ్చితమైనవో తేలిపోతుంది
.
¤ ఎన్‌బీఎఫ్‌సీలు నమోదైన నాటినుంచి మూడు సంవత్సరాల్లోపు కనీసం 12 శాతం మేర ఒకటో అంచె, కనీస మూలధన నిష్పత్తి (సీఏఆర్)ను కలిగి ఉండాలి. (సీఏఆర్ అనేది బ్యాంకుల కీలక మూలధనానికి, నష్టభయానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే నిష్పత్తి
)
¤ ఆర్‌బీఐ వద్ద ఎన్‌బీఎఫ్‌సీగా రిజిస్టర్ కావడం రుణ దాతలకు, పెట్టుబడి దారులకు సంతృప్తిని కలగజేసే విధంగా ఒక గుర్తింపును సంతరించాలి.
¤ కొత్త ఎన్‌బీఎఫ్‌సీలు కనీసం రూ.50 కోట్ల ఆస్తులు కలిగి ఉండాలి
.
¤ ఎన్‌బీఎఫ్‌సీలో 25 శాతానికి పైగా వాటా మార్పునకు ఆర్‌బీఐ ముందస్తు అనుమతిని పొందడం తప్పనిసరి
.
¤ బ్రోకర్లకు రుణం ఇవ్వడానికి బ్యాంకులు పాటిస్తున్న తరహా నియమావళినే ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ పాటించాలి.
¤ ఎన్‌బీఎఫ్‌సీ లకు సైతం బ్యాంకు ప్రొవిజన్ మాదిరి నియమాలను దశలవారిగా వర్తింపజేయాలి
ఆగస్టు 30 
¤ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి ప్రాజెక్టులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి భారత్‌కు 20 కోట్ల యూరోల (దాదాపు రూ. 1,300 కోట్లు) రుణం లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంకుకు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఈఐబీ) ఈ రుణాన్ని అందిస్తుంది. భారత్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఈయూ ఈ సాయం చేస్తోంది.
¤ ప్రైవేటు కంపెనీలు చేపట్టే సోలార్ ఫొటో వోల్టాయిక్, బయోమాస్, పవన విద్యుత్ లాంటి పర్యావరణ అనుకూల సంప్రదాయేతర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు రుణసాయానికి ఈ నిధులను వినియోగిస్తారు
.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు కేవలం 7.7 శాతంగా నమోదయింది. ఒకటిన్నర ఏళ్లలో ఇదే కనిష్ఠ స్థాయి. 2009-10 అక్టోబరు-డిసెంబరులో 7.3 శాతంగా నమోదైన తర్వాత ఇదే తక్కువ స్థాయి వృద్ధి కావడం గమనార్హం
.
¤ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 8.8 శాతంగా నమోదవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధిరేటు 8.5 శాతంగా నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది
.
¤ జూన్ 30, 2011తో ముగిసిన త్రైమాసికంలో తయారీ రంగం వృద్ధి 10.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది
.
¤ తవ్వకాల రంగం కేవలం 1.8 శాతం వృద్ధితో సరిపుచ్చుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 7.4 శాతంగా నమోదైంది
.
¤ వ్యవసాయ రంగం మాత్రం 2.4 నుంచి 3.9 శాతానికి పెరిగి కొంత ఊరటనిచ్చింది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ల విభాగం సైతం 12.1 నుంచి 12.8 శాతానికి పుంజుకోవడం విశేషం
.
¤ బీమా, స్థిరాస్థిరంగం మాత్రం 9.8 నుంచి 9.1 శాతానికే పరిమితమైంది
.
¤ కీలకమైన ఎనిమిది మౌలిక సదుపాయల పరిశ్రమలు జూలై నెలలో 7.8 శాతం మేర పురోగమించాయి. ఇది పారిశ్రామికోత్పత్తి మెరుగు పడుతోందన్న ఆశలు రేకెత్తిస్తోంది. 2010 జూలైలో ఈ పరిశ్రమల వృద్ధి 5.7 శాతం మాత్రమే
.
¤ విద్యుత్తు, ఉక్కు, సిమెంటు ఉత్పత్తి ఆరోగ్యకరమైన పెరుగుదలను కనబరచడం తాజా వృద్ధికి దారితీసినట్లు న్యూఢిల్లీలో విడుదల చేసిన ప్రొవిజనల్ డేటాలో పేర్కొన్నారు. అయితే, ఇదే ఏడాది జూన్‌లో కీలక మౌలిక పరిశ్రమలు 5.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి
.
¤ ఈ ఎనిమిది పరిశ్రమల్లోనూ ముడి చమురు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, సహజ వాయువు, ఎరువులు, బొగ్గు, విద్యుత్తు, సిమెంటు, ఫినిష్డ్ స్టీలు ఉన్నాయి
.
¤ మొత్తం మీద పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమలకు 37.90 శాతం వెయిటేజి ఉంది
.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) కీలక పరిశ్రమలు 5.8 శాతం మేరకు పురోగమించాయి. కిందటి సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ పరిశ్రమలు 6.5 శాతం వృద్ధిని సాధించాయి.